పచ్చని చెట్లను నరికేశారు...

by Sridhar Babu |
పచ్చని చెట్లను నరికేశారు...
X

దిశ, కొండాపూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మ కంగా హరిత హారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి మొక్కల సంరక్షణకు కృషి చేస్తుంది. ప్రతి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం, వాటిని సంరక్షిస్తున్నారు. కానీ దీనికి భిన్నంగా గత నాలుగు సంవత్సరాల క్రితం నాటిన మొక్కలు.. నేడు నీడనిచ్చే చెట్లుగా మారాయి. వాటిని విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ హైటెన్షన్ వైర్లకు అడ్డువస్తున్నాయని నరికివేశారు. మల్లేపల్లి నుండి గొల్లపల్లి కి వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా పచ్చని పొలాల ముందు ఆహ్లాదకరమైన వాతావరణంలో రోడ్డు పై వెళ్లే వాహన దారులకు నీడనిచ్చే చెట్లను నరికివేయడం పై ప్రజలు

అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణ చూసుకోవడానికి లక్షలు వెచ్చిస్తుంది. అయితే సుమారుగా నాలుగు సంవత్సరాలుగా మొక్కలు పెరిగేందుకు నిత్యం నీటి సరఫరా, ట్రీ గార్డుల ఏర్పాటు చేసి ఎంతో శ్రమించి చెట్లను పెంచితే వాటిని నరికివేయడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 120 చెట్లకు పైగా నరికివేసినట్లు గ్రామస్తులు చెపుతున్నారు. ఈ సంఘటనపై విద్యుత్ శాఖ ఏఈని అడగగా విద్యుత్ లైన్ల కిందనే చెట్లు పెంచడం, తద్వారా ప్రజలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని, రానున్న వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని నరికి వేసినట్టు చెప్పారు.



Next Story

Most Viewed