నా చావే‌ చివరిది కావాలి.. లైంగిక వేధింపులు ఆగాలి.. కన్నీరు తెప్పిస్తోన్న యువతి సూసైడ్

by  |
నా చావే‌ చివరిది కావాలి.. లైంగిక వేధింపులు ఆగాలి.. కన్నీరు తెప్పిస్తోన్న యువతి సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత సమాజంలో మైనర్‌ పిల్లల నుంచి వృద్ధులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సంఘటనలు క్షణ.. క్షణానికి ఎక్కడో‌ ఒక చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. వెలుగుచూడని ఘటనలు కోకొల్లలు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ప్రబుద్ధుల మనసు మారడం లేదు. వీరి వికృత క్రీడలతో‌ జరిగిన అఘాయిత్యాన్ని బయటపెట్టలేని అమాయకులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో తమిళనాడులో ఓ యువతి రాసిన సూసైడ్‌ నోట్ యావత్ సమాజాన్ని కన్నీరు‌ పెట్టిస్తోంది.

తమిళనాడు‌లోని కరూర్‌‌కు చెందిన 17 ఏండ్ల యువతి.. 12వ తరగతి(సీబీఎస్‌ఈ) చదువుతోంది. తండ్రి గతంలోనే చనిపోగా.. తల్లి(వితంతువు)తో కలిసి ఉంటుంది. శుక్రవారం స్కూల్ నుంచి ఇంటికొచ్చిన ఆమె లోపలికి వెళ్లి గడియపెట్టుకుంది. ఈ సమయంలో తల్లి కూడా ఇంట్లో లేదు. ఆ తర్వాత ఎంతకీ బయటకు రావడం లేదని పొరుగింటి వృద్ధురాలు కిటికీ నుంచి తొంగి చూడగా.. ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించింది. పనులు ముగించుకుని ఇంటికొచ్చిన తల్లి.. కూతురి శవాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలింది.

ఇదే సమయంలో ఆ ఇంట్లో దొరికిన సూసైడ్ లెటర్‌ అందరినీ బాధించింది. ‘సమాజంలో అమ్మాయిలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. లైంగిక వేధింపులు భరించలేక చనిపోతున్న చివరి అమ్మాయిని నేనే కావాలి.. ఎందుకంటే నాపై అఘాయిత్యం చేసింది ఎవరో చెప్పడానికి కూడా చనిపోయే ముందు భయపడుతున్నాను.. ఎంతో మందికి హెల్ప్ చేద్దామనుకున్నాను.. కానీ, ఈ లోకాన్ని చాలా తొందరగా విడిచివెళ్తున్నాను’ అంటూ యువతి రాసిన సూసైడ్ లేఖ చివరకు పోలీసుల మనసును కలచివేసింది. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి‌పై లైంగిక దాడి చేసింది ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు.


Next Story

Most Viewed