- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
BREAKING: దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు, 45 మంది దుర్మరణం
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్: బస్సులో లోయలో పడి 45 మంది దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోట్స్వానా రాజధాని గాబోరోన్ నుంచి మోరియాలోని సెయింట్ ఎంజెనాస్ జియోనిస్ట్ క్రిస్టియన్ చర్చిలో ఈస్టర్ పండుగకు 46 మంది బస్సులో బయలుదేరారు. ఈ క్రమంలో బస్సు లింపోపో ప్రావిన్స్లోని మోకోపనే, మార్కెన్ మధ్య రెండు కొండలను కలిపే వంతెనపైకి రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయి బస్సు ఒక్కసారిగా 50 లోతులో గల లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 45 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మరికొన్ని శిథిలాల నడుమ చిక్కుకుపోయాయి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అయితే, ఒకే చిన్నారి తీవ్ర గాయాలతో పడి ఉండటంతో సహాయక బృందం ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించింది.
Next Story