కరెంటు షాక్ తగిలి వ్యక్తి దుర్మరణం

by Disha Web Desk 15 |
కరెంటు షాక్ తగిలి వ్యక్తి  దుర్మరణం
X

దిశ,మేడ్చల్ టౌన్ : కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శామీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమరపు లక్ష్మణ్ కాంట్రాక్టు బేసిక్​లో మూసపేట్ లో ఎలక్ట్రీషియన్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని అంతాయి పల్లి గ్రామ పరిధిలోని జన చైతన్య వెంచర్ లో గత మూడు రోజులుగా ఓ ప్రైవేట్ కంపెనీలో మిషన్ భగీరథ పైప్ లైన్ లో పని చేస్తున్నాడు. ఓ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఒక ఎల్ సీ నుంచి సప్లై తీసుకోవాల్సింది మరో ఎల్ సీ నుంచి సప్లై తీసుకోగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎలాంటి జాగ్రత్తలు తీస్కోకుండా పనులు చేపట్టిన కాంట్రాక్టర్ శివారెడ్డి పై చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ రావు కుటుంబ సభ్యులు కోరారు.



Next Story

Most Viewed