విషాదం : మేనేజర్ చేసిన పనికి కార్మికుడు బలి

by  |
విషాదం : మేనేజర్ చేసిన పనికి కార్మికుడు బలి
X

దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుమలపాడులో విషాదం చోటు చేసుకుంది. సెల్పీ వీడియో తీసుకుని ఓ కెమికల్ ఫ్యాక్టరీ కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. అశోక్ అనే కార్మికుడు బుధవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనను తన మేనేజర్ చిత్రహింసలకు గురిచేస్తున్నారని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. అంతే కాకుండా ఆ బాధలు భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుటున్నట్టు సెల్ఫీ వీడియాలో తెలిపారు. అశోక్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కర్నూలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed