చెన్నైలో వోల్వో బస్సులు బుగ్గిపాలు

by  |
చెన్నైలో వోల్వో బస్సులు బుగ్గిపాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చెన్నైలోని కోయంబేడులో ప్రైవేట్ బస్సులు నిలిపే ప్రదేశంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న వోల్వో బస్సులు మంటలకు ఆహుతి అవుతున్నాయి. బస్సులు అన్ని పక్కపక్కనే ఉండటంతో వేగంగా మంటలు వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు తెచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed