యూపీ, పంజాబ్‌లో హైఅలర్ట్..

by  |
యూపీ, పంజాబ్‌లో హైఅలర్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో ISIS ఉగ్రవాది అరెస్టుతో ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ప్రస్తుతం విచారణలో ఉన్న ఉగ్రవాది పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించాడు. దీంతో రెండు రాష్ట్రాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. పట్టుబడిన ఉగ్రవాది నుంచి అధునాతన పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాకుండా, దేశ రాజధానిలో NSG కమెండోలతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.ఈ నేపథ్యంలో యూపీలోని అన్ని జిల్లాల పోలీసులను డీజీపీ హెచ్చరించారు.అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని వారికి ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, ఐసీసీ ఉగ్రవాదిని దేశరాజధానిలో శుక్రవారం భద్రతాబలగాలు పట్టుకున్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed