నేడు నగరానికి అమిత్ షా

by  |
నేడు నగరానికి అమిత్ షా
X

దిశ, వెబ్‎డెస్క్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నేడు హైదరాబాద్‎కు కేంద్ర మంత్రి అమిత్ షా రానున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు అమిత్ షా చేరుకోనున్నారు. ఉదయం 10.45 గంటలకు భాగ్యలక్ష్మీ ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

అనంతరం వారాసిగుడా చౌరస్తా నుంచి సీతాఫల్ మండి వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి అమిత్ షా చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల సరళి, ప్రజల స్పందన, పోలింగ్ అంశాలపై చర్చించనున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో పాతబస్తీలో కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి.

Next Story

Most Viewed