ఉద్యోగం రాలేదని నిరుద్యోగి ఆత్మహత్య…

by  |
ఉద్యోగం రాలేదని నిరుద్యోగి ఆత్మహత్య…
X

దిశ, నవీపేట్ : ఉద్యోగం రావడం లేదని ఆవేదనతో మండల కేంద్రంలోని తడగామ కాలనీకి చెందిన నేతికుంట చందు(30) ఈ నెల 16న పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. తమ కుమారుడు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతోనే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడని, ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి గంగాధర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Next Story