రైలు కిందపడి నిరుద్యోగి ఆత్మహత్య

by  |
రైలు కిందపడి నిరుద్యోగి ఆత్మహత్య
X

దిశ, జమ్మికుంట: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని ఆశించినప్పటికీ, ఇంతకాలం ఎదురుచూసినప్పటికీ తాను నిరుద్యోగి గానే ఉండిపోయానని, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను పోషించలేని ఓ నిరుద్యోగి ఆదివారం జమ్మికుంట రైల్వే స్టేషన్ లో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామగుండం రైల్వే అవుట్ పోస్టు ఇంచార్జ్ తిరుపతి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన మహమ్మద్ షబ్బీర్ (26) అనే నిరుద్యోగి ఆదివారం జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని జేబులో సూసైడ్ నోట్ లభించిందని, అందులో ఉద్యోగం రాక, మనస్థాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నానని రాసి ఉన్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. కాగా మృతదేహాన్ని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Next Story

Most Viewed