- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బెంగళూరుకు 250వ మ్యాచ్.. హైదరాబాద్కు ఎన్నో మ్యాచో తెలుసా?
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు అరుదైన మైలురాయిని సాధించింది. గురువారం హైదరాబాద్తో ఆడిన మ్యాచ్ లీగ్లో ఆర్సీబీకి 250వది. ఈ మైలురాయిని సాధించిన రెండో జట్టుగా బెంగళూరు నిలిచింది. ఆర్సీబీ కంటే ముందు ముంబై ఇండియన్స్ ఈ ఘనత సాధించింది. ఇప్పటివరకు ముంబై జట్టు 255 మ్యాచ్లు ఆడింది. 250 మ్యాచ్ల్లో బెంగళూరు 118 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 128 మ్యాచ్ల్లో ఓడగా.. నాలుగింట ఫలితం తేలలేదు.
ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన జట్లలో ముంబై, బెంగళూరు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ 247 మ్యాచ్లతో మూడో స్థానంలో ఉండగా.. కోల్కతా నైట్రైడర్స్(244), పంజాబ్ కింగ్స్ (240) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. చెన్నయ్ జట్టు 233 మ్యాచ్లు ఆడింది. రాజస్థాన్ రాయల్స్ 214 మ్యాచ్లు, సన్రైజర్స్ హైదరాబాద్ 174 మ్యాచ్లు ఆడాయి.