ఈవీఎం కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హరిచందన

by Disha Web Desk 11 |
ఈవీఎం కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హరిచందన
X

దిశ ,మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ... పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల భద్రత విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంల కమిషనింగ్ చేస్తున్న సందర్భంలో ఏదైనా సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే సమాచారం అందించాలని అన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు జాగ్రత్త వహించాలని అన్నారు. ఆమె వెంట ఆర్ డి ఓ, ఏ ఆర్ ఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ హరిబాబు తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed