వాళ్లు ఎంత చిన్న ప్రాణాలని కామెంట్ చేసిన రోజా.. పవన్ కల్యాణ్ జోస్యం చెప్పిన గెటప్ శ్రీను!

by Disha Web Desk 7 |
వాళ్లు ఎంత చిన్న ప్రాణాలని కామెంట్ చేసిన రోజా.. పవన్ కల్యాణ్ జోస్యం చెప్పిన గెటప్ శ్రీను!
X

దిశ, సినిమా: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు మద్దతుగా జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. దీనిపై స్పందించిన మంత్రి రోజా ‘వాళ్లు ఎంత చిన్న ప్రాణాలు. వాళ్లని ఏం అనకూడదు. మెగా ఫ్యామిలీ పెద్ద కుటుంబం. దీంతో సినీ ఇండస్ట్రీలో వాళ్లకు లైఫ్ లేకుండా చేస్తారు అనే భయంతోనే ఆ కుటుంబంతో ఉన్నారు’ అంటూ కామెంట్స్ చేసింది రోజా. ఇప్పటికే దీనిపై సుధీర్, ఆది స్పందించగా.. తాజాగా గెటప్ శ్రీను సైతం స్పందించాడు.

గెటప్ శ్రీను తాజాగా నటిస్తున్న చిత్రం ‘రాజు యాదవ్‌’. ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్ ఈవెంట్‌లో మంత్రి రోజా కామెంట్స్‌పై స్పందించాడు శ్రీను. ఆయన మాట్లాడుతూ.. ‘మెగా ఫ్యామిలీతో మాత్రమే కాకుండా.. వెంకటేశ్‌, ఎన్టీఆర్‌, నాని వంటి హీరోలతోనూ సినిమాలు చేస్తున్నాము. వేరే వేరే సినిమాల్లో కూడా మాకు ఆఫర్లు వస్తున్నాయి. అయినా అందరూ అందరికి నచ్చాలని రూల్ లేదు. మాకు పవన్‌ కల్యాణ్‌పై అభిమానం ఉంది కాబట్టే.. జనసేన తరఫున ప్రచారం చేశాం. అక్కడ ప్రచారానికి మంచి స్పందన లభించింది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ లక్ష మెజారిటీతో గెలుస్తారు’ అంటూ జోస్యం చెప్పాడు గెటప్ శ్రీను. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read More...

పద్మశ్రీ అవార్డు గ్రహిత మొగిలయ్యకు కేటీఆర్ సాయం.. నటుడు బ్రహ్మాజీ రియాక్షన్ ఇదే! (పోస్ట్)

Next Story

Most Viewed