ఈతకు వెళ్లి..ఇద్దరు విద్యార్థుల మృతి

by  |
ఈతకు వెళ్లి..ఇద్దరు విద్యార్థుల మృతి
X

దిశ, చిత్తూరు : ఈత కోసమని వెళ్లిన ఇద్దరు యువకులు విగత జీవులుగా మారారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం చికులబైలు సమీపంలోని కదిరమ్మ చెరువు వద్ద సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..హోలి పండుగ సందర్భంగా చెరువులో ఈత కోసం వెళ్లిన గణేష్‌(13), సందీప్‌ (10) అనే విద్యార్థులు ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి చనిపోయారు.వీరి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలసుకున్న విద్యార్థుల కుటుంబీకులు, తోటి స్నేహితులు శోకసంద్రంలో మునిగారు. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Tags: two students died in Pond, chittoor, holy fest, madana palli, going for swimming
slug : two students died due to sunk in pond



Next Story

Most Viewed