- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో: నీట్లో తప్పుడు ర్యాంకులు ప్రకటించుకుంటున్న శ్రీ చైతన్య, ఆకాష్ లాంటి కార్పొరేట్ సంస్థల పై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హరీష్ గౌడ్ డిమాండ్ చేశారు. తల్లిదండ్రులను, విద్యార్థులను తప్పుడు ప్రకటనలతో మోసం చేస్తున్న ఈ విద్యాసంస్థలను రాష్టంలో నిషేధించాలని డిమాండ్ చేశారు. ఒకే విద్యార్థులు వేర్వేరు విద్యాసంస్థలకు చెందినట్టు ఎలా ప్రకటించుకుంటారని, గతంలోనూ పలు సందర్భాల్లో కార్పొరేట్ విద్యాసంస్థలు ఈ రకమైన మోసాలకు పాల్పడినా ప్రభుత్వాలు స్పందించలేదని ఆరోపించారు.
ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష ఫీజును తగ్గించాలి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జరిగే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష సెట్ ఫీజులను తగ్గించాలని టీవీఎస్ డిమాండ్ చేసింది. బీసీలు రూ.800, వికలాంగులు రూ.600 చెల్లించాలని నిర్ణయించడం పేదలకు ఆర్థికంగా భారమవుతుందని, కొవిడ్-19 కాలంలో పేద, మధ్య తరగతి విద్యార్థుల కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఫీజును తగ్గించాలని కోరింది. అధిక ఫీజుల నిర్ణయాన్ని పున:సమీక్షించి ఎస్సీ, ఎస్టీలకు రూ. 200, బీసీ విద్యార్థులకు రూ.300, వికలాంగులకు ఉచితంగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసింది.