భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ

by  |
భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్ లైన్ శ్రీవారి కళ్యాణోత్సవ సేవా టికెట్లను… ఈ నెల 6వ తేదీ నుంచి విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఆగస్టు 7 నుంచి 31 వరకు ఈ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

శ్రీవారి కళ్యాణోత్సవ సేవలో పాల్గొనే భక్తులు కేవలం ఆన్‌లైన్‌లోనే పాల్గొనాలని.. ఇందుకోసం తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ప్రతీ రోజు మధ్యహ్నం 12 గంటలకు భక్తులు ఈ సేవలో పాల్గొనాలని స్పష్టం చేసింది. అటు పూజలో పాల్గొనే వారు ఇంటి వద్ద నున్నా సంప్రదాయ దుస్తులనే ధరించాలని సూచనలు చేసింది. భక్తులకు ఆన్ లైన్ ద్వారా ప్రసాదాలను పంపిణీ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేయడం గమనార్హం. కరోనా వైరస్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ వెల్లడించింది.

Next Story