బాక్సింగ్‌లో మూడు పతకాలు ఖాయం

by Dishanational3 |
బాక్సింగ్‌లో మూడు పతకాలు ఖాయం
X

దిశ, స్పోర్ట్స్ : కజకిస్థాన్‌లో జరుగుతున్న ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌ బాక్సర్లు సత్తాచాటుతున్నారు. మంగళవారం పురుషుల విభాగంలో విశ్వనాథ్ సురేశ్ (48 కేజీలు), ఆకాశ్(60 కేజీలు), ప్రీత్ మాలిక్ (67 కేజీలు) తమ విభాగాల్లో సెమీస్‌కు దూసుకెళ్లి పతకాలు ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రస్తుత యూత్ వరల్డ్ చాంపియన్ విశ్వనాథ్ 5-0 తేడాతో హస్సాని సెయిదర్శమ్(ఇరాన్)ని చిత్తు చేశాడు. ఆకాశ్ 5-0 తేడాతో ఎబాది అర్మాన్(ఇరాన్)ను ఓడించాడు. వియత్నానికి చెందిన న్గుయెన్ డక్ ఎన్‌గోక్‌ను ఆకాశ్ దీప్ మట్టికరిపించాడు. ప్రత్యర్థిపై పంచ్‌లదాడికి దిగిన ఆకాశ్ తొలి రౌండ్‌లోనే విజయం సాధించాడు. 75 కేజీల కేటగిరీలో కునాల్ 0-5 తేడాతో మహ్‌షరీ మహ్మద్ చేతిలో ఓడిపోయి క్వార్టర్స్‌లో నిష్ర్కమించాడు. శనివారం సెమీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Next Story

Most Viewed