పేకాట స్థావరంపై రైడ్స్.. టీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త అరెస్ట్..?

by  |
పేకాట స్థావరంపై రైడ్స్.. టీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త అరెస్ట్..?
X

దిశ, నర్సంపేట టౌన్: నర్సంపేట పట్టణంలోని సాయిబాబా గుడి సమీపంలో గల ఒక ఇంట్లో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. విశ్వసనీయ సమాచారంతో ఎస్ఐ రామ్ చరణ్, రాజేందర్‎ల ఆధ్వర్యంలో ఆ ఇంటిపై సిబ్బందితో కలిసి దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.50,290 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా అరెస్టు కాబడిన వారిలో స్థానిక టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ భర్త ఉన్నట్లు సమాచారం.

Next Story