- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరణం గెలవని మాతృప్రేమ..! ఊపిరి ఆగిపోయినా కొడుకును వదలని తల్లి
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన పడవ ప్రమాదంలో ఓ హృదయవిదారక ఘటన వెలుగుచూసింది.

దిశ, వెబ్డెస్క్: మధ్యప్రదేశ్లోని జబల్పూర్ (Jabalpur)లో చోటుచేసుకున్న పడవ ప్రమాదం దేశాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. నదిలో పడవ మునిగిపోతున్న సమయంలో ఓ తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి చేసిన పోరాటం అమ్మతనానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. జబల్పూర్ సమీపంలోని బర్గి డ్యామ్ (Bargi Dam)లో ప్రయాణికులతో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తూ మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మొత్తం ఏడుగురు మృతి చెందగా 15 మందిని సహాయక బృందాలు కాపాడాయి. తాజాగా మరో రెండు మృతదేహాలను వెలికి తీశారు. ఈ క్రమంలోనే రెస్క్యూ టీమ్స్ గాలింపు చర్యలు చేపడుతుండగా.. నీటి అడుగున ఓ హృదయవిదారక దృశ్యం కనిపించింది. ఓ మహిళ మృతదేహం తన నాలుగేళ్ల బిడ్డను గట్టిగా హత్తుకుని ఉన్న స్థితిలో లభ్యమైంది. ఊపిరి ఆగిపోతున్న క్షణంలో కూడా తన కొడుకును వదలకుండా ప్రాణాలొదిలిన ఆ తల్లిని చూసి రెస్క్యూ సిబ్బంది, అధికారులను సైతం కన్నీరు పెట్టుకున్నారు.






