మహిళలకు తోడుగా ‘సఖి’: ప్రతిమ

by  |
మహిళలకు తోడుగా ‘సఖి’: ప్రతిమ
X

దిశ, మెదక్: లాక్‌డౌన్ నేపథ్యంలో జిల్లాలోని మహిళలు, పిల్లలు, బాలికలకు చుట్టుపక్కల వారి నుంచి లైంగిక వేధింపులు, గృహ హింస ఇతర సమస్యలు ఉత్పన్నమైతే సిద్దిపేటలోని సఖి కేంద్రానికి సమాచారం ఇవ్వాలని పర్యవేక్షకురాలు స్వరూప, అడ్మినిస్ట్రేటర్ ప్రతిమ తెలిపారు. సోమవారం సిద్దపేటలో పర్యటించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్ 181 కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే సఖి కేంద్రం అండగా నిలుస్తుందన్నారు. జిల్లాకు సంబంధించిన నెంబర్ 08457229108ను సైతం సంప్రదించవచ్చునని తెలిపారు. లాక్‌డౌన్ కొనసాగినంత కాలం ఫోన్‌లో కౌన్సిలింగ్ ఇస్తామని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో ఈ సదుపాయం వచ్చిందన్నారు.

Tags : Tour, Siddipet, Sakhi Center, organizers, prathima, medak, siddipet



Next Story

Most Viewed