చల్లగాలికి నిద్రపోయిన వారి ఇంట్లో దొంగలు ఏంచేశారంటే.. ?

by  |
చల్లగాలికి నిద్రపోయిన వారి ఇంట్లో దొంగలు ఏంచేశారంటే.. ?
X

దిశ, ధర్మపురి: వేసవి వచ్చిందంటే చాలు పల్లెటూరిలో చాలా మంది వాకిట్లో నిద్రపోతారు. అయితే అలా ఓ గ్రామంలో అందరూ ఇంటిికి తాళం వేసి వాకిట్లో నిద్రపోయారు. దీంతో బుధవారం అర్ధరాత్రి దుండగులు తలుపుకు ఉన్న ఇంటి తాళాలు తీసి రెండు ఇళ్లను చోరి చేశారు. ఈ ఘటన ధర్మపురి మండలంలోని కమలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మూడారి రాజన్న, రాజూరి శ్రీనివాస్​ల కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఇంటి ముందు పడుకున్నారు. దుండగులు తలుపుకు ఉన్న ఇంటి తాళాలు తీసి ఇంట్లోకి ప్రవేశించి రాజన్న ఇంట్లోని 7 తులాల బంగారు నగలు, నగదుతో పాటు కొంత వెండి సామాగ్రిని దొంగిలించి, పక్కనే ఉన్న శ్రీనివాస్​ ఇంట్లో చొరబడి వారి ఇంట్లో ఉన్న 5 తులాల బంగారం, రూ. 2 వేల నగదు తో పాటు కొంత వెండి సామాగ్రిని దొంగిలించారు. తర్వాత కుమ్మరి శంకర్​ ఇంట్లో ప్రవేశించి ఇంటి తాళాలు తీశారు. అక్కడ ఏమి దొరకక పోవడంతో కుమ్మరి తిరుపతి ఇంట్లో ప్రవేశించి బీరువ తాళాలు పగల కొట్టేందుకు ప్రయత్నం చేశారు. దీంతో సౌండ్​ రావడం వలన తిరుపతికి తెలివి రావడంతో అతను గట్టిగా అరిచాడు దాంతో దుండగులు పారి పోయినట్లు తెలిపారు. సంఘటన స్థలానికి ధర్మపురి ఎస్సై కిరణ్ కుమార్ వెంటనే వెళ్లి వేలి ముద్ర నిపుణులను తీసుకొచ్చి ఆధారాలను సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ తెలిపారు.


Next Story

Most Viewed