- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఇందల్వాయి: ఇందల్వాయి స్టేషన్ పరిధిలోని NH హైవే ప్రక్కన గల కుంటలో తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ అజీజ్(40) శుక్రవారం రాత్రి కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు తెలిపారు. మృతుని కుమారుడు తన తండ్రిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ.. ఫలితం లేకపోయింది. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. కూతురు పెళ్లి మరో నెల ఉండగానే తండ్రి మృతి చెందడంతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. తొలుత మృతదేహాం కోసం గాలింపు చర్యలు చేపట్టకపోవడం పట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. ఆలస్యమైనా ఎట్టకేలకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టగా.. మృతదేహాం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.