పెళ్లై పదహారు రోజులే.. అంతలోనే వధువుకు షాకిచ్చిన వరుడు

by  |
పెళ్లై పదహారు రోజులే.. అంతలోనే వధువుకు షాకిచ్చిన వరుడు
X

దిశ, వెబ్ డెస్క్ : వారం రోజుల క్రితం ఆ ఇంట్లో ఎంతో ఆనందం. ఇంటికి కొత్త కోడలు వస్తుందని ఆ ఇంటివారు ఎంతో సంతోషంతో ఉన్నారు. తన కొడుకును పెళ్లి కొడుకును చేసి ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. కానీ ఆనందం ఎన్ని రోజులో నిలవలేదు. పెళ్లైన పదహారు రోజులకే ఆ ఇంట విషాదం నిండుకుంది. అయితే కరోనా విజృంభన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పెళ్లైన పదహారు రోజులకి పెళ్లికొడుకు అతని భార్యకు, తల్లికి కరోనా పాజివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో వారందరూ హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. అయితే పెళ్లి కొడుకు పరిస్థితి విషమించడంతో అతను మృతి చెందారు. ఈ హృదయవిధారక ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం జల్లాపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. నవ వరుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో, ఊరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని మరణంతో నవవధువు, అతని తల్లి రోదనలు మిన్నంటాయి.

Next Story

Most Viewed