నిర్మాణ రంగ కార్మికులకు ఆర్థిక సాయం చేసిన ‘మహా’ సర్కారు

by  |
నిర్మాణ రంగ కార్మికులకు ఆర్థిక సాయం చేసిన ‘మహా’ సర్కారు
X

ముంబయి : మహారాష్ట్రలో కరోనా కట్టడికి ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్‌డౌన్ నిబంధనలతో ఉపాధి కోల్పోయిన నిర్మాణ రంగ కార్మికులను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ సర్కారు ఆదుకుంటున్నది. రిజిస్టర్డ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ బ్యాంకు ఖాతాలలో ఒక్కొక్కరికి రూ. 1,500 చొప్పున నగదు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇప్పటివరకు 9.17 లక్షల మంది కార్మికులకు రూ. 137.61 కోట్లను ట్రాన్స్‌ఫర్ చేసినట్టు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి హసన్ ముష్రిఫ్ తెలిపారు. మహారాష్ట్రలో రిజిస్టర్డ్ నిర్మాణ రంగ కార్మికులు 13 లక్షల మంది ఉన్నారు. గతేడాది లాక్‌డౌన్ సందర్భంగా నమోదై ఉన్న కన్స్ట్రక్షన్ వర్కర్స్‌కు ప్రభుత్వం రూ. 5 వేల ఆర్థిక సాయం చేసింది.



Next Story

Most Viewed