- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, దుబ్బాక : వారం రోజుల్లో పెళ్లి ఉండగా యువకుడు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. దుబ్బాక మండలం పెద్ద గుండవెళ్లి గ్రామంలో గొర్రెల కాపరి రాజు (22) తన గొర్రెల కొట్టంలో ఉరివేసుకుని బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… నెల రోజుల క్రితం 60 గొర్రెలు చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక రాజు మనస్థాపానికి గురయ్యాడు.
ఈనెల 18న అతని పెండ్లి ఉండగా అంతలోనే ఇలాంటి ఘటన జరిగిందన్నారు. 60 గొర్రెలు చనిపోవడంతో రాజు అప్పు చేశాడని, ఆ తర్వాత పెండ్లి కోసం మరిన్ని అప్పులు చేయాల్సి వచ్చిందని రాజు తీవ్రమనస్థాపం చెందాడు. దీంతో గొర్రెలు చనిపోయిన చోటే ఉరివేసుకుని రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ప్రభుత్వం పరంగా రాజు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు కోరుతున్నారు.
Next Story