గొర్రెలు చనిపోయాయని కాబోయే వరుడు ఆత్మహత్య

by  |
గొర్రెలు చనిపోయాయని కాబోయే వరుడు ఆత్మహత్య
X

దిశ, దుబ్బాక : వారం రోజుల్లో పెళ్లి ఉండగా యువకుడు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. దుబ్బాక మండలం పెద్ద గుండవెళ్లి గ్రామంలో గొర్రెల కాపరి రాజు (22) తన గొర్రెల కొట్టంలో ఉరివేసుకుని బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… నెల రోజుల క్రితం 60 గొర్రెలు చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక రాజు మనస్థాపానికి గురయ్యాడు.

ఈనెల 18న అతని పెండ్లి ఉండగా అంతలోనే ఇలాంటి ఘటన జరిగిందన్నారు. 60 గొర్రెలు చనిపోవడంతో రాజు అప్పు చేశాడని, ఆ తర్వాత పెండ్లి కోసం మరిన్ని అప్పులు చేయాల్సి వచ్చిందని రాజు తీవ్రమనస్థాపం చెందాడు. దీంతో గొర్రెలు చనిపోయిన చోటే ఉరివేసుకుని రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ప్రభుత్వం పరంగా రాజు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు కోరుతున్నారు.


Next Story

Most Viewed