- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూముల రిజిస్ట్రేషన్లపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామ/ వార్డు సచివాలయాల్లోనే భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతుందని సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా తొలి దశలో రాష్ట్రంలోని 51 గ్రామ సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలివిడతలో భాగంగా ఎంపికైన గ్రామ సచివాలయాల్లోని సిబ్బందికి రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ద్వారా […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామ/ వార్డు సచివాలయాల్లోనే భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతుందని సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా తొలి దశలో రాష్ట్రంలోని 51 గ్రామ సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలివిడతలో భాగంగా ఎంపికైన గ్రామ సచివాలయాల్లోని సిబ్బందికి రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఆ తర్వాత విడతల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అందరికీ శిక్షణ ఇచ్చి భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Next Story






