- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామ/ వార్డు సచివాలయాల్లోనే భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతుందని సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా తొలి దశలో రాష్ట్రంలోని 51 గ్రామ సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలివిడతలో భాగంగా ఎంపికైన గ్రామ సచివాలయాల్లోని సిబ్బందికి రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఆ తర్వాత విడతల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అందరికీ శిక్షణ ఇచ్చి భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Next Story