- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీలోకి కూకట్పల్లికి చెందిన కీలక నేత..?
దిశ, కూకట్పల్లి: కూకట్పల్లి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. రాష్ట్రంలో రోజు రోజుకు చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో కూకట్పల్లిలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కూకట్పల్లి నియోజకవర్గంలో మాస్లీడర్గా పేరొందిన ఖనిజాభివృద్ధి శాఖ మాజీ చైర్మన్వడ్డెపల్లి నర్సింగరావు కుమారుడు వడ్డెపల్లి రాజేశ్వర్రావు బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. వైఎస్సార్హయాంలో ఓ వెలుగు వెలిగిన మాస్లీడర్ వడ్డెపల్లి నరసింగరావు వారసుడు రాజేశ్వర్రావు వైఎస్జగన్తో అదే సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ గత రెండు దఫాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం సలహామండలి సభ్యులుగా కొనసాగుతున్నారు.
కూకట్పల్లి వడ్డెపల్లిదే..
సుధీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వడ్డెపల్లి కుటుంబానికి కూకట్పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో రాజేశ్వర్రావు క్రీయాశీలక రాజకీయాలల్లో ఉంటే ప్రధానపార్టీలకు గట్టి పోటీ ఉండే అవకాశాలు లేక పోలేదు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా వడ్డెపల్లి రాజేశ్వర్రావు కేంద్రంలోని ఓ పెద్ద నాయకుడితో టచ్లో ఉన్నారని, త్వరలో బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వడ్డెపల్లి రాజేశ్వర్రావు బీజేపీలో చేరితే గత అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలైన ఆ పార్టీకి కూకట్పల్లిలో మరింత బలం చేకూరుతుందనడంలో సందేహం లేదు.
వడ్డెపల్లి రాజేశ్వర్రావును కలిసిన బీజేపీ నేత
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు హరీష్రెడ్డి శుక్రవారం వడ్డెపల్లి రాజేశ్వర్రావును ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. దీంతో వడ్డెపల్లి రాజేశ్వర్రావు త్వరలో బీజేపీలో చేరుతున్నారన్న చర్చ బలంగా కొనసాగుతుంది. రాజేశ్వర్రావు ఎప్పుడు అధికారికంగా బీజేపీలో చేరుతారో వేచి చూడాల్సి ఉంది.
కూకట్పల్లిలో బీజేపీ పుంజుకుంటుందా...?
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూకట్పల్లిలో అధికార పార్టీ చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసిన బీజేపీ గ్రేటర్ఎన్నికలలో మూసాపేట్ డివిజన్లో జెండా ఎగరేయడంతో ఆ పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహాన్ని నింపింది. గత అసెంబ్లీ ఎన్నికలలో అధికార పార్టీలో ఉన్న హరీష్రెడ్డి గ్రేటర్ ఎన్నికల ముందు బీజేపీలో చేరడం, మేడ్చల్జిల్లా అర్బన్అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత జరిగిన గ్రేటర్ఎన్నికలలో అధికార పార్టీ నాయకులకు పోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో గట్టి పోటీ ఇవ్వడంతో పాటు మూసాపేట్డివిజన్లో విజయం సాధించారు. దాని తరువాత హరీష్రెడ్డి, నియోజకవర్గం ఇన్చార్జి మాధవరం కాంతారావులు నియోజకవర్గంలో పాదయాత్రలు, సమస్యలపై పోరాటం చేస్తూ, బూత్స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే కూకట్పల్లిలో మంచి పట్టున్న వడ్డెపల్లి రాజేశ్వర్రావు బీజేపీలో చేరితే ఆ పార్టీకి మరింత బలం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.