- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. అతడి వల్లే అంటున్న తల్లిదండ్రులు..!
by Disha Web Desk 19 |
X
దిశ, నల్లగొండ: ఉరేసుకుని ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని శేషమ్మ గూడెంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కాలనీకి చెందిన దోరెపల్లి భిక్షమయ్య కుమార్తె ప్రత్యూష (17) పట్టణంలోని సప్తపది జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో ఓ యువకుడు ప్రత్యూషను వేధిస్తున్నట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె నాయనమ్మ గమనించి, స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. కాగా, ఓ యువకుడి వేధింపుల వల్లే తమ కుమారై ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నామని రూరల్ ఎస్ఐ గోపాల్ రావ్ తెలిపారు.
Next Story