ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రిమాండ్ ఖైదీ రవితేజ పరార్

by Disha Web Desk 2 |
ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రిమాండ్ ఖైదీ రవితేజ పరార్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏలూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రిమాండ్ ఖైదీ రవితేజ తప్పించుకున్నాడు. వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న రవితేజ పరార్ కావడం రాష్ట్రంతో కలకలం రేపుతోంది. నడుంనొప్పి కారణంగా ఈనెల 14న రవితేజను ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తు్న్నారు. కాగా, గంజి ప్రసాద్ వైసీపీలో చేరిన తర్వాత వైసీపీలో బజారయ్యకు, గంజి ప్రసాద్‌కు మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమయ్యింది. ఈ క్రమంలోనే జి.కొత్తపల్లికి సమీపంలోనే గంజి ప్రసాద్‌ను ప్రత్యర్ధులు బైక్‌పై వచ్చి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య కేసులో మొత్తం 12 మందిపై కేసు నమోదు చేసి, నిందితుల్లో ఆరుగురిని అరెస్ట్ చేశామని ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ శర్మ వెల్లడించారు.


Next Story

Most Viewed