ఫుడ్​సేప్టీ ఆఫీసర్లకు షాక్.. వంట నూనెల కల్తీపై తీవ్ర ఆందోళన

by Disha Web Desk |
ఫుడ్​సేప్టీ ఆఫీసర్లకు షాక్.. వంట నూనెల కల్తీపై తీవ్ర ఆందోళన
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంస్థలు ఉత్పత్తి చేస్తున్న వంట నూనెల్లో కల్తీ జరుగుతున్నట్లు ఫుడ్​సేప్టీ అండ్​స్టాండర్స్​అధారిటీ ఆఫ్​ఇండియా అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు రాష్ట్రంలోని 98 ఉత్పత్తి కంపెనీల నుంచి శాంపిల్స్​ సేకరించి టెస్టులు నిర్వహిస్తున్నది. ప్రాథమిక రిపోర్టులో 90% శాంపిల్స్‌లో కల్తీ జరిగినట్లు తేలింది. ఫైనల్​పరీక్షల కొరకు పుడ్​ టెస్టింగ్​ల్యాబ్‌లలో పరీక్షలు జరుగుతున్నట్లు ఆఫీసర్లు వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్​ తర్వాత కల్తీ ఆయిల్స్​ పెరిగిపోయినట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలంతా కంపెనీతో పాటు ప్రమాణాల నాణ్యతను కూడా తెలుసుకొని ఆయిల్​ కొనుగోలు చేయాలని ఫుడ్​సేప్టీ ఆఫీసర్లు సూచిస్తున్నారు. మరోవైపు కొన్ని ఆయిల్​ కంపెనీల్లో ర్యాండమ్‌గా శాంపిళ్లు తీసుకొని రాసిడిటీ (ఆయిల్​ లో స్టాండర్స్​) ఎంత వరకు ఉన్నాయనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీంతో పాటు టీ పౌడర్​శాంపిళ్లను కూడా చెక్​చేయనున్నారు.

ఆకస్మిక తనిఖీలు...

రాష్ట్ర వ్యాప్తంగా ఇక నుంచి ఫుడ్​సేప్టీ ఆఫీసర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. బేకరీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్​ఫుడ్​సెంటర్లు, కేఫ్‌లు, కూల్​డ్రింక్​షాపులు తదితర చోట ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. ఎక్కడికక్కడ శాంపిళ్లను పరీక్షించేందుకు మొబైల్​ టెస్టింగ్​ ల్యాబ్‌ను వెంట తీసుకువెళ్లనున్నారు. ఈ మేరకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పడి తనిఖీలు చేసేందుకు ఫుడ్​సేప్టీ అధారిటీ సిద్ధమైంది.


Next Story

Most Viewed