రూ.250కే ఆన్‌లైన్ సెక్స్.. యువకులే టార్గెట్‌గా న్యూడ్​ కాల్స్​

by Disha Web Desk 4 |
రూ.250కే ఆన్‌లైన్ సెక్స్.. యువకులే టార్గెట్‌గా న్యూడ్​ కాల్స్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: "రాత్రి 10 గంటల సమయం. నిద్రకు ఉపక్రమించే ముందు మరోసారి మొబైల్​ ఫోన్​ ను చేతుల్లోకి తీసుకుని, నెట్​ ఆఫ్​ చేసే ముందు వాట్సాప్​ లో వచ్చిన మెస్సేజ్​ లన్నీ క్లియర్​ చేసే పనిలో పడ్డాడో యువకుడు. అప్పుడు ఒక తెలియని నెంబర్​ నుంచి హాయ్​ అని మెస్సేజ్​ వచ్చింది. నెంబర్​ కూడా ఎక్కడిదో. మనోళ్లే ఎవరైనా కావచ్చు అని తిరుగు రిప్లై హలో అని ఇచ్చాడు. అంతే.. ఇక రెచ్చగొట్టే మెస్సేజ్​ లు ఒకటి వెంట ఒకటి వస్తూనే ఉన్నాయి. అందులో మొదటిదే.. వీడియో కాల్​ సెక్స్​ రూ. 250 ఓన్లీ. 15 నిమిషాలు, టోటల్​ న్యూడ్​. అదే ఫైనల్​ రేట్​. నేను రెడీ.. నువ్వు కూడా రెడీనా.. పేటీఎం లేదా ఫోన్​ పే.. గూగుల్​ పే.. ఎలా పంపిస్తారు.. ఐయామ్​ రెడీ డార్లింగ్​.. అంటూ వరుస మెస్సేజ్​ లు వచ్చాయి. ముందుగా తేలిగ్గా తీసుకున్నా.. ఆ తర్వాత మాత్రం సదరు యువకుడు కూడా టెంప్ట్​ అయ్యాడు. రిప్లై ఇవ్వడం మొదలు పెట్టాడు. అవతలి నుంచి ఇంకా కవ్వించడం స్టార్ట్​ అయింది. నిద్ర మాయమైంది. చాటింగ్​ లో బిజీ అయ్యాడు. ముందుగా డెమో అంటూ అడిగాడు. చివరకు రూ. 100 పే చేస్తే 2 నిమిషాలు డెమో అంటూ రిప్లై వచ్చింది. వందే కదా.. అని పంపించాడు. డెమో కాల్​ కూడా వచ్చింది. ఇదే సదరు యువకుని కొంప ముంచింది. ''

నైట్​ టార్గెట్​

వీడియో న్యూడ్​ కాల్స్​ అంటూ రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కొత్త కొత్త నెంబర్ల నుంచి వాట్సాప్​ మెస్సేజ్​ లు ఇటీవల కాలంలో జోరందుకున్నాయి. మన రాష్ట్రాన్ని.. నార్త్​ స్టేట్స్​ టార్గెట్​ చేసినట్లుగా మారింది. ప్రధానంగా ఢిల్లీ, పంజాబ్​ వంటి ప్రాంతాల నుంచి ఈ ఫోన్లు వస్తున్నట్లు అనుమానిస్తున్నారు. వాట్సాప్​ మెస్సేజ్​ నుంచి హాయ్​ అంటూ పంపించి.. పరిచయం పెంచుకుంటున్నారు. అటు నుంచి వచ్చిన మెస్సేజ్​ కు రిప్లై వెళ్లిందంటే ఇక అంతే. వారి మాయలో పడేంత వరకు రెచ్చగొడుతూనే ఉంటారు.

తెలివిగా వలలోకి

ముందుగా వంద.. రెండొందల నుంచి బేరాలకు దిగుతున్నారు. మెస్సేజ్​ లు పంపిన తర్వాత.. రిప్లై వెళ్తే వెంటనే చాటింగ్​ స్టార్ట్​ చేస్తున్నారు. పూర్తి న్యూడ్​ వీడియో కాల్​ చేస్తామని, రూ. 250 వరకు చెల్లిస్తే 15 నిమిషాలు మీరు చెప్పినట్లుగా వీడియో కాల్​ లో చేస్తామంటూ రెచ్చగొడుతున్నారు. అంతేకాదు.. నమ్మకం కోసం న్యూడ్​ పిక్స్​ లేదా.. డెమో కాల్ అంటూ ఆఫర్​ ఇస్తున్నారు. రూ. 100కే డెమో కాల్​ చేస్తామంటూ కవ్విస్తున్నారు. వందే కదా అని తేలిగ్గా తీసుకుని డెమో కాల్​ కు కనెక్ట్​ అయితే చాలు.. ఇగ అంతే. కనీసం నిమిషం నుంచి రెండు నిమిషాలు డెమో కాల్​ చూపించి, ఆ తర్వాత పూర్తి న్యూడ్​ వీడియో కాల్​ 10 నుంచి 15 నిమిషాలకు రూ.250 అంటూ కవ్వింపులు మొదలవుతున్నాయి. అప్పటికే రూ. 100తో డెమో కాల్​ తో టెంప్ట్​ అవుతున్న యూత్​.. అడిగిందే తడువుగా రూ. 250 చెల్లిస్తున్నారు.

రూ. 250 తో మొదలై.. వెయ్యి వరకు వసూల్​

ఇలా రూ. 250తో మొదలైన వీడియో కాల్​ చాటింగ్​.. కనీసం రూ. 1000 వరకు వెళ్తోంది. ముందుగా 250కి 15 నిమిషాలు కాల్​ అంటూ బుజ్జగిస్తూ.. ఆ తర్వాత ఇంకో వంద రూం చార్జీ, ఫుల్​ న్యూడ్​ తో క్లారిటీ వీడియోకు వంద, ఇలా.. చెప్తూ వెయ్యి వరకు ట్రాన్స్​ఫర్​ చేయించుకుంటున్నారు. ఆ తర్వాత ఐదో, పది నిమిషాలో న్యూడ్​ వీడియో కాల్​ వస్తోంది.

ఇక బ్లాక్​ మెయిలింగ్​ షురూ

వెయ్యి వరకు పే చేసి న్యూడ్​ వీడియో కాల్​ వచ్చిన తర్వాత అటు నుంచి కూడా మీ వీడియో కూడా చూపించాలి అంటూ రెచ్చగొడుతున్నారు. అప్పటికే ఆ మాయలో పడిపోయిన యువకులు.. అంతా ఓపెన్​ చేసి వాళ్ల కెమెరా ముందు ఉంటున్నారు. కాల్​ పూర్తయిన తర్వాత అసలు సమస్య మొదలవుతోంది. వెంటనే ఇప్పటి వరకు వచ్చిన వీడియో రికార్డింగ్​ మళ్లీ వాట్సాప్​ కు వస్తోంది. దీంతో ఖంగుతింటున్న యువకులు.. తిరిగి ప్రశ్నిస్తే వెంటనే బ్లాక్​ మెయిలింగ్​ స్టార్ట్​ అవుతోంది. ఈ వీడియోను సోషల్​ మీడియాలో వైరల్​ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. వెంటనే పదివేలు పంపించాలనే డిమాండ్​ మొదలవుతోంది. నెత్తీనోరు బాదుకుంటూ వారిని కన్విన్స్​ చేసే ప్రయత్నం సదరు యువకుల వైపు నుంచి ఉంటోంది. కానీ, న్యూడ్​ వీడియో కాల్​ చేసిందే బ్లాక్​ మెయిలింగ్​ కోసం. దీంతో ఏకంగా యువకుల ఖాతాల్లో ఎంతుందో స్క్రీన్​ షాట్​ పంపించాలంటూ అవతలి నుంచి మెస్సేజ్​ లు రావడంతో.. ఉన్నదాంట్లోనే ఎంతో కొంత పే చేస్తున్నారు. కానీ, ఇది ఒక్కరోజుతో సమిసిపోయే సమస్యగా ఉండటం లేదు. మళ్లీ వారానికో, పది రోజులకో ఈ బ్లాక్​ మెయిలింగ్​ బ్యాచ్​ నుంచి సమాచారం వస్తూనే ఉంటోంది.

హైదరాబాద్​ లో లక్షల మంది బాధితులు

ఒక్కరో, ఇద్దరో కాదు.. కేవలం హైదరాబాద్​ లోనే లక్షల మంది యువత ఇలాంటి న్యూడ్​ కాల్స్​ కు బాధితులుగా మారారు. బయటకు చెప్పుకోలేక.. పోలీసులకు ఫిర్యాదు చేయలేక వేలల్లో సమర్పించుకుంటున్నారు. హాయ్​ అని వచ్చిన ఒక్క మెస్సేజ్​ కు రిప్లై ఇచ్చినందుకు తమ పరువును రోడ్డున పడేసుకుంటున్నారు. కొంతమంది సైబర్​ పోలీసులకు కూడా సమాచారమిస్తున్నారు. కానీ, సైబర్​ పోలీసులకు ఇలాంటి కేసులను డీల్​ చేసే సమయం లేకపోవడంతో.. ఈ దందా కొనసాగుతోంది. కొన్ని నెంబర్లను ట్రేస్​ చేసినా.. అవన్నీ ఢిల్లీ, పంజాబ్​, యూపీ వంటి ప్రాంతాలకు చెందినవారిగా తేలుతోంది. ఇలా ఒక్కటో, పదో నెంబర్లు కాదు.. వేల సంఖ్యల్లో ఫోన్​ నెంబర్లు ఉంటున్నాయి. అందుకే యూత్​ జాగ్రత్తగా ఉండాల్సిందే.


Next Story

Most Viewed