ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరో బోల్తా ఘటనలో 17 మంది..

by Dishafeatures2 |
ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరో బోల్తా ఘటనలో 17 మంది..
X

దిశ, మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని నర్వ పోలీస్ స్టేషన్ పరిధిలో బొలెరో బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు చనిపోగా 17 మందికి గాయాలు అయిన సంఘటన మంగళవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో జరిగింది, గద్వాల్ ఎల్లమ్మ తల్లికి మోక్కులను నేర్చుకుందామని కాన్ దొడ్డి గ్రామానికి చెందిన 40 మంది భక్తులు బొలొరోలో వెళ్తున్నారు. నర్వ మక్తల్ మండల పరిధిలోని కల్వర్టు మలుపు దగ్గర బోలోరో బోల్తా పడింది. ఈ ఘటనలో తాయమ్మ(40). రఘు(35) మృతి చెందారు. మరో 17 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని మహబూబ్ నగర్ ఆస్పత్రికి తరలించారు.

మిగతా వారు మక్తల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ కాకుండా మరో వ్యక్తి బొలొరోను అతి వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని బాధితులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో వాహనం నడిపిన శ్రీకాంత్ అనే వ్యక్తికి ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని నర్వ ఎస్సై మదన్ మోహన్, మక్తల్ సీఐ సీతయ్య తెలిపారు.




Next Story

Most Viewed