దుమ్మురేపిన భారత రెజ్లర్లు.. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

by Disha Web Desk 19 |
దుమ్మురేపిన భారత రెజ్లర్లు.. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం
X

దిశ, వెబ్‌డెస్క్: కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత రెజ్లర్లు దుమ్మురేపుతున్నారు. రెజ్లింగ్ విభాగంలో ఇప్పటికే భారత్ తరుపున భజరంగ్ పునియా స్వర్ణం సాధించగా.. తాజాగా మరో పసిడి పతకం భారత కైవసం చేసుకుంది. పురుషుల ఫ్రీస్టైల్ 86 కేజీల విభాగంలో భారత రెజ్లర్ దీపక్ పునియా పసిడి పతకం దక్కించుకున్నాడు. ఫైనల్లో పాకిస్థాన్‌కు చెందిన ముహమ్మద్ ఇనామ్‌ను ఓడించి బంగారు పతకాన్ని సాధించాడు. కాగా, కామన్వెల్త్ గేమ్స్‌లో దీపక్ పునియాకు ఇదే తొలి స్వర్ణ పతకం. ఇక బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 9 స్వర్ణ పతకాలు గెల్చుకుంది.


Next Story

Most Viewed