'ఇంకా బీజేపీలోనే ఎట్ల ఉంటున్నరు'

by Disha Web Desk 2 |
ఇంకా బీజేపీలోనే ఎట్ల ఉంటున్నరు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కులాల వారీగా లెక్కలు తీయాలని, మరీ ముఖ్యంగా బీసీ జనాభా గణన చేయాలని బీసీ సంఘాల నేతలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్రం బీసీ జనాభ గణన చేయం.. అని తేల్చి చెప్పడంతో ప్రవీణ్ కుమార్ బీసీ నేతలకు కీలక సూచనలు చేశారు. ''కేంద్రంలో మోడీ ప్రభుత్వం మేము బీసీ జనాభా గణన చేయం - చేయనివ్వం అని ఖరాఖండిగా చెప్పినా ఇంకా బీజేపీలోనే ఎట్ల ఉంటున్నరు బీసీ అన్నలారా, అక్కలారా?'' అంటూ ఆర్ఎస్‌పీ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.


Next Story

Most Viewed