వారిద్దరూ అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లు.. ఆస్ట్రేలియా క్రికెటర్ ఎల్లీస్ పెర్రీ

by Dishafeatures2 |
వారిద్దరూ అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లు.. ఆస్ట్రేలియా క్రికెటర్ ఎల్లీస్ పెర్రీ
X

హామిల్టన్ : మహిళల వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఎల్లీస్ పెర్రీ భారత క్రీడాకారిణులపై కీలక వ్యాఖ్యలు చేసింది. టీమిండియాలో ఓపెనింగ్ బ్యాటర్ స్మృతి మంధాన, వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌లు ఇద్దరూ అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లుగా అభివర్ణించింది. భారత బ్యాటింగ్ లైనప్‌ స్ట్రెంత్ గురించి మేము నిరంతరం తెలుసుకుంటూనే ఉంటామని ఆమె పేర్కొంది. అయితే, న్యూజిలాండ్‌లో జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ లీగ్ మ్యాచుల్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా వరుసగా నాలుగు మ్యాచులు గెలిచి అజేయంగా నిలిచింది. భారత్ ఇప్పటివరకు మూడు మ్యాచులు ఆడగా వెస్టిండీస్, పాకిస్తాన్ జట్లపై గెలిచి న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది.కాగా, మార్చి 19న టీమిండియా మహిళల జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది.


Next Story

Most Viewed