- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
టీనేజ్ కూతుళ్లతో పోటీపడి చదువుకుంటున్న 53 ఏళ్ల తల్లి
దిశ, వెబ్డెస్క్: చదువుకు వయస్సుతో సంబంధం లేదని నిరూపించింది ఓ ఇల్లాలు. తన కూతుళ్లతో కలిసి 10వ, తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది ఈ మహిళ. త్రిపురకు చెందిన షిలారాణి దాస్ (53) అనే మహిళ 10వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరైంది. మరోవైపు ఆమె కూతుళ్లు కూడా ఇంటర్ పరీక్షలు రాశారు. బుధవారం 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలను వెలువడ్డాయి.ఈ ఫలితాల్లో ఆమె పిల్లలు ఇంటర్ పరీక్షలు పాస్ కాగా.., షిలా రాణి దాస్ పది ఫలితాల్లో సత్తాచాటారు. కాగా ఆమె చదువు మానేసి 28 ఏళ్ల తర్వాత, త్రిపుర బోర్డ్ పరీక్షలకు హాజరై.. ఈ ఏడాది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. పదో తరగతి పాస్ అయినందుకు నేను సంతోషంగా ఉన్నానని, నా కుమార్తెలు నాకు మద్దతు ఇచ్చారని షిలా రాణి చెప్పకొచ్చింది. షీలా దాస్కు చిన్న వయస్సులోనే వివాహం కావడంతో చదువు ప్రయత్నాలు అక్కడే ఆగిపోయాయి. కొన్నాళ్ల తర్వాత కుమార్తెలిద్దరూ తమ తల్లిని బోర్డు పరీక్షలు రాయడానికి కృషి చేశారు. దీంతో తమ పిల్లలు ఇంటర్ పాస్కాగా, తను పదో తరగతి పాస్ కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.