- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నీలి చొక్కాలతో రండి.. పోరాటం చేద్దాం
దిశ, తెలంగాణ బ్యూరో : మాదిగలకు 12 శాతం రిజర్వేషన్కల్పించాల్సిన అవసరం ఉన్నదని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సబ్బండ వర్గాల హక్కుల పోరాటం కోసం ఏప్రిల్ 14న ఎస్సీ ,ఎస్టీ, బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లి సుందరయ్య పార్క్ నుంచి ట్యాంకుబండ్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు శోభ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ యాత్రలో పాల్గొనే అన్ని సంఘాల నాయకులు, కార్యకర్తలు నీలి చొక్కాలు ధరించి రావాలని పిలుపు నిచ్చారు. బీసీలకు 50% రిజర్వేషన్ , రజకులను ఎస్సీ జాబితాలోకి చేర్చడం, ముస్లింలకు ,గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్, ఎస్సీల కు 20 శాతం రిజర్వేషన్ కల్పించే అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గోపి, భిక్షపతి, ఎండల ప్రదీప్, మైస ఉపేందర్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.