బావిలో పడి వ్యక్తి మృతి.. తండ్రి మరణించిన కొన్ని రోజులకే..

by Dishafeatures2 |
బావిలో పడి వ్యక్తి మృతి.. తండ్రి మరణించిన కొన్ని రోజులకే..
X

దిశ, నెక్కొండ: తండ్రి మరణంతో మానసిక ఒత్తిడికి గురై చేద బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన దీక్షకుంట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కాసుల.సతీష్(30) అనే స్వర్ణకారుడు తన ఇంటి వద్దే కులవృత్తి చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.15 రోజుల క్రితం తండ్రి కాసుల.సారయ్య(60) మృతి చెందాడు. తండ్రి మృతితో కుమారుడు సతీష్ గత కొన్ని రోజులుగా డిప్రెషన్‌కు గురై శుక్రవారం రాత్రి ఇంట్లోనుండి వెళ్లిపోయాడు. గ్రామ సమీపంలోని చేద బావిలోపడి మృతి చెందాడని తెలిపారు. మృతునికి తల్లి, భార్య మాధవి, కొడుకు పూర్ణ చారి, కూతురు సాత్విక ఉన్నారు. తండ్రి మృతి చెందిన కొద్ది రోజులకే కొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.


Next Story

Most Viewed