పాలకుర్తి సోమేశ్వరుడిని దర్శించుకున్న ప్రముఖులు

by Web Desk |
పాలకుర్తి సోమేశ్వరుడిని దర్శించుకున్న ప్రముఖులు
X

దిశ, పాలకుర్తి: మహాశివరాత్రి సందర్భంగా శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహిస్తున్నా బ్రహ్మత్సవాల్లో మంగళవారం ప్రముఖులు స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్ర హైకోర్టు జడ్జి దక్కన్ విజయ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి దయాకర్ రావు సతీసమేతంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పూజలు చేశారు. అనంతరం కళ్యాణ మండపం, సెంట్రల్ లైటింగ్ సిస్టంను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ పాలకుర్తి, వల్మీడి, బమ్మెరలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సోమేశ్వర లక్ష్మి నరసంహ స్వామి ఆశీసులతో నియోజకవర్గ ములో అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed