హనుమకొండలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభం.. సందడి చేసిన పూజా హెగ్డే

by Dishafeatures2 |
హనుమకొండలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభం.. సందడి చేసిన పూజా హెగ్డే
X

దిశ, హనుమకొండ: ప్రముఖ వస్త్ర స్టోర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తమ 20వ షో రూమ్ ను హనుమకొండలో ప్రారంభించింది. సెలబ్రిటీ గెస్ట్ గా హాజరైన ప్రముఖ సినీ నటి పూజా హెగ్డే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్ , ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 20వ షో రూమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. నగర ప్రజల షాపింగ్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను హన్మకొండలో ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏర్పాటుతో నగరానికి కల వచ్చిందని అన్నారు.

ఇక యాక్ట్రెస్ పూజా హెగ్డే మాట్లాడుతూ.. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 20వ షో రూమ్ ను తన చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. సౌత్ ఇండియా షాపింగ్ డైరెక్టర్లు శ్రీ సురేష్ పీర్ల, కేశవ్ మాట్లాడుతూ.. వరంగల్ మహా నగరంలో తమ స్టోర్ ను ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. పిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు అన్ని బ్రాండ్ల వస్త్రాలు తక్కువ ధరలకే లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బసవరాజు సారయ్య, తదితరులు పాల్గొన్నారు.



Next Story