- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. పోలీసుల విచారణకు హాజరైన నటి లిషి, సందీప్
by Disha Web Desk 19 |
X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీ కేసులో నిందితులుగా ఉన్న నటి లిషి, సందీప్లు గచ్చిబౌలి పోలీసుల ఎదుట హాజరయ్యారు. పోలీసులు ఇద్దరి నుంచి రక్తం, వెంట్రుకలు, మూత్రం నమూనాలు సేకరించి డ్రగ్ పరీక్షల నిమిత్తం పంపించారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్ పార్టీ జరిగిందన్న సమాచారం మేరకు గచ్చిబౌలి పోలీసులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంజీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ వివేకానంద్తో పాటు మరి కొందరిని అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న లిషి, సందీప్, శ్వేతలు అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీస్ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. ఇది కొనసాగుతుండగానే లిషి, సందీప్లు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కాగా, ఇప్పటికీ పరారీలోనే ఉన్న నీల్, కేదార్లకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.
Next Story