పోలీసుల అదుపులో మరో ముగ్గురు BRS నేతలు? గంగుల గ్యాంగ్‌లో టెన్షన్ టెన్షన్!

by Disha Web Desk 4 |
పోలీసుల అదుపులో మరో ముగ్గురు BRS నేతలు? గంగుల గ్యాంగ్‌లో టెన్షన్ టెన్షన్!
X

దిశ, బ్యూరో కరీంనగర్ : కరీంనగర్ పోలీసుల అదుపులో ముగ్గురు బీఆర్ఎస్ నేతలు పారిపాయారా? లేక పట్టుకున్నారా? కరీంనగర్‌లో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనే విషయం హట్ టాపిక్ గా మారింది. ఓ వైపు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారంటూ ఉదయం నుండి నగరంలో చర్చ జరుగుతుండగా.. పదకొండు గంటల నుండి ఒక్కరినే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు తప్పించుకున్నారు అనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరుగా చర్చ జరుగుతుంది.

కరీంనగర్‌లోని పలువురు కార్పోరేటర్లు, బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు అయి నిందితులు కటకటాల పాలుకాగ మిగిలిన నేతల అరెస్టు ఎప్పుడు అనే ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఈ రోజు తెల్లవారు జామున మరో ముగ్గురు బీఆర్ఎస్ నేతలు ఎడ్ల అశోక్, తుల బాలయ్య, కాశెట్టి శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనే పుకార్లు జోరు అందుకున్నాయి. కాగా మరో వైపు పోలీసులు పట్టుకునే క్రమంలో ఎడ్ల అశోక్, కాశెట్టి శ్రీనివాస్లు తప్పించుకున్నారు అనే పుకార్లు సైతం నగరంలో జోరందుకున్నాయి.

ఆర్థిక నేరాల కేసులో ముగ్గురు నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు భూకబ్జాలు, ఎకనామికల్ అఫెన్సెస్‌పై విచారిస్తున్నట్టు తెలుస్తుంది. భూ కబ్జాలు, నకిలీ డాక్యుమెంట్ల తయారీకి పాల్పడ్డట్టు ముగ్గురిపై ఆరోపణలు ఉండగా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్న ఎకనామిక్స్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) పోలీసులు... విచారణ చేసి అరెస్టు చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తుంది.



Next Story

Most Viewed