శిఖర్‌ను తిరుపతిలో పెళ్లి చేసుకోబోతున్న జాన్వీ కపూర్.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసిన దేవర బ్యూటీ!

by Disha Web Desk 6 |
శిఖర్‌ను తిరుపతిలో పెళ్లి చేసుకోబోతున్న జాన్వీ కపూర్.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసిన దేవర బ్యూటీ!
X

దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ సినీ ఇండస్ట్రీకి వచ్చింది. హిందీలో పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీతో ఇండస్ట్రీలో రాణిస్తోంది. అలాగే ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం కాబోతుంది. అయితే ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగానే.. జాన్వీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. చరణ్-బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ‘ఆర్సి16’ మూవీలో జాన్వీ హీరోయిన్‌గా సెలక్ట్ అయిపోయింది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అయితే ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలో చాన్స్ రావడంతో జాన్వీ కపూర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

ఈ అమ్మడు ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. అలాగే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ బోల్డ్ ఫొటోలతో రచ్చ చేస్తుంది. ఇక జాన్వీ కపూర్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె గత కొద్ది కాలంగా శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ అమ్మడు శిఖర్‌తో కలిసి ఎన్నోసార్లు కెమెరాకు చిక్కింది. దీంతో వీరిద్దరు నిజంగానే లవ్‌లో ఉన్నారని అంతా నమ్మేశారు. అయితే ఇటీవల శిఖర్‌తో తిరుపతికి కూడా వెళ్లింది.

దీంతో వీరిద్దరు అక్కడే పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఈ అమ్మడు స్పందించలేదు. ఈ క్రమంలోనే వీరిద్దరి ఫొటోను షేర్ చేసి ఓ నెటిజన్ జాన్వీ-శిఖర్ పెళ్లి తొందరలో తిరుపతిలో జరగనుందంటూ ఓ పోస్ట్ పెట్టాడు. అది కాస్త జాన్వీ కపూర్ కంట పడటంతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ‘‘కుచ్ బీ’’ అంటూ పోస్ట్‌కు రిప్లై ఇచ్చింది. దీంతో ఏదైనా రాసేస్తారా? అందులో ఎలాంటి నిజం లేదని చెప్పకనే చెప్పేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Next Story