మందుబాబులకు తెలంగాణ సర్కార్ భారీ శుభవార్త.. రాష్ట్రంలో తగ్గిన మద్యం ధరలు

by Disha Web Desk 19 |
మందుబాబులకు తెలంగాణ సర్కార్ భారీ శుభవార్త.. రాష్ట్రంలో తగ్గిన మద్యం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: మందుబాబులకు తెలంగాణ సర్కార్ భారీ శుభవార్త చెప్పింది. మద్యంపై రాష్ట్ర ప్రభుత్వం విధించే ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో క్వార్టర్‌పై రూ.10, హాఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ. 40 మేర ధరలు తగ్గనున్నాయి. తగ్గించిన మద్యం ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. కాగా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో బీరు మినహా అన్ని రకాల మద్యం బ్రాండ్లపై ధరలు తగ్గాయి. అక్రమ మద్యం కట్టడిలో భాగంగా ఈ ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Read More:

హైదరాబాద్‌లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్ కార్టూన్ (6-5-2023)


Next Story