గోల్కొండ కోటలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు..కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 21 |
Kishan Reddy
X

దిశ,వెబ్‌డెస్క్: గోల్కొండ కోటలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏ ఒక్క కుటుంబం, ఏ ఒక్క వ్యక్తి ద్వారా తెలంగాణ సాధ్యం కాలేదని..ఎంతో మంది ఉద్యమ కారుల త్యాగాల ద్వారా మాత్రమే సాధ్యమైందని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల పోరాటంతోనే రాష్ట్రం వచ్చిందని చెప్పారు. తెలంగాణ బిల్లు పెట్టించడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్‌ని గుర్తు చేసుకున్నారు. సుష్మాస్వరాజ్ తెలంగాణ కోసం పోరాడారు అని అన్నారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంటే ..మరోవైపు కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను గోల్గొండ కోటలో నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తరుఫున అజాది కా అమృత్ హహోతోత్సవంలో భాగంగా గోల్కొండ కోటలో నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారందరూ వేడుకలకు హాజరయ్యారు.


Next Story