కుటుంబాన్ని చంపేందుకు స్కెచ్.. దుండగులు ఏం చేశారంటే?

by Disha Web Desk 4 |
కుటుంబాన్ని చంపేందుకు స్కెచ్.. దుండగులు ఏం చేశారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: కుటుంబాన్ని చంపేందుకు దుండగులు స్కెచ్ వేయడం కలకలం రేపింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్‌ మండలం సంజీవన్ రావు పేటలో చోటు చేసుకుంది. కుటుంబాన్ని కరెంట్ షాక్ ఇచ్చి చంపేందుకు దుండగులు కుట్ర పన్నారు. ఇందులో భాగంగా ఆగంతకులు తలుపులకు విద్యుత్ వైర్లు పెట్టారు. అయితే తల్లి, కూతురికి కరెంట్ షాక్ రాగా స్థానికులు వెంటనే స్పందించి కాపాడారు. నిందితులు బావి వద్ద గల రెండు మోటార్లను సైతం తగలబెట్టారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.



Next Story