శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి : వి.సైదిరెడ్డి

by Batti.Sumithra |   (  Updated:2026-04-29 04:23:07  IST  )

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతిఒక్కరు సహకరించాలని కడ్తాల్ సీఐ వి. సైదిరెడ్డి అన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి : వి.సైదిరెడ్డి
X

దిశ, కడ్తాల్ : శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతిఒక్కరు సహకరించాలని కడ్తాల్ సీఐ వి. సైదిరెడ్డి అన్నారు. మంగళవారం బాధ్యతలు స్వీకరించిన సైదిరెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు మండల ప్రజలు సహకరించాలని, ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి నడుచుకోవాలని, ఎవరైనా చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంవత్సర కాలం పాటు ఇక్కడ విధులు నిర్వహించిన సి.హెచ్ గంగాధర్ ను పరిపాలన సౌలభ్యం నేపథ్యంలో హైదరాబాద్ మల్టీజోన్-2 కు బదిలీ పై వెళ్తున్న సందర్భంగా సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వరప్రసాద్, చంద్రశేఖర్, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Next Story