సర్వే నిలిపి స్థానికులకు న్యాయం చేయాలి

by Disha Web Desk 15 |
సర్వే నిలిపి స్థానికులకు న్యాయం చేయాలి
X

దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : మండల పరిధిలోని కుద్బుల్లాపూర్ గ్రామం సర్వేనెంబర్ 152లో అధికారులు చేపట్టిన భూ సర్వేను నిలిపివేసి స్థానిక గ్రామస్తులకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గ్రామపంచాయతీ కార్యదర్శి గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి వినతి పత్రం అందజేశారు. గ్రామంలో అనేకమంది పేదలు ఉన్నారని వారికి కాకుండా కొంతమంది బడా నాయకులకు ప్రభుత్వ భూమి కట్టబట్టేందుకు గాను సర్వేల పేరుతో స్థానికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో నిరుపేద కుటుంబాలు అనేకం ఉన్నాయని వారికీ ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరారు. స్పందించిన అధికారులు సర్వేను నిలిపివేసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed