రంజిత్ రెడ్డిని గెలిపించండి మీకు తప్పకుండా న్యాయం చేస్తా : రేవంత్ రెడ్డి

by Disha Web Desk 23 |
రంజిత్ రెడ్డిని గెలిపించండి మీకు తప్పకుండా న్యాయం చేస్తా : రేవంత్ రెడ్డి
X

దిశ,సరూర్ నగర్ : తెలంగాణకు మోడీ తీరని అన్యాయం చేశాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కిచ్చేన్నగరి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఆర్కే పురం డివిజన్ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ముఖ్యఅతిథిగా వచ్చిన రేవంత్ రెడ్డి కెసిఆర్ మోడీపై విరుచుకుపడ్డాడు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మోడీ రైతుల ఆదాయం రెండింతలు చేస్తానని చెప్పి ఎంతోమంది రైతులను బలి చేశాడు. కాంగ్రెస్ హయాంలో వచ్చిన ఎన్నో ఫ్యాక్టరీలను, ఇన్స్టిట్యూషన్ లను రద్దు చేశాడు.నేను అధికారంలోకి వచ్చి ఐదు నెలలే అవుతుంది, ఆడబిడ్డలకు ఆర్టీసీ ఫ్రీ బస్ పెడితే మెచ్చుకోవాల్సింది పోయి తిడతావా. నువ్వు ఢిల్లీ నుండి తెలంగాణకు వచ్చేది నన్ను తిట్టడానికా, పదేళ్లు ప్రధానమంత్రిగా, 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నరేంద్ర మోడీ గుజరాత్ కు బంగారు గుడ్డు తెలంగాణకేమో గాడిద గుడ్డా అని అన్నారు.పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏనాడూ ఎన్టీఆర్ నగర్ ప్రజల ప్లాట్ల రెగ్యులరైజేషన్ గురించి ఆలోచించలేదు రంజిత్ రెడ్డిని గెలిపించండి మీకు తప్పకుండా న్యాయం చేస్తా అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

సరూర్నగర్ ఆర్కే పురం ప్రజలు మాట ఇస్తే తప్పకుండా ఓటు వేస్తారు అని, మహేశ్వరం నియోజకవర్గ నుండి 25 వేల మెజారిటీ ఓట్లు ఇస్తే చేవెళ్ల నుండి లక్ష మెజారిటీ తెప్పించి రంజిత్ రెడ్డిని పార్లమెంట్ కి పంపుదాం అన్నారు.చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ మతతత్వ పార్టీ అని, వాళ్లు సంక్షేమాలు ఇవ్వరు.. ఇచ్చే వాళ్ళను ఇవ్వనివ్వరు. ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒక టూరిస్ట్ లాగా ఎలక్షన్ల ముందే వస్తాడు, ప్రజలలో ఉండదు అని అన్నారు. బీజేపీ పార్టీకి ఓటు వేస్తే నష్టమే కానీ ఎలాంటి లాభం లేదు అని అన్నారు ఎన్టీఆర్ నగర్ ప్రజలకు ప్లాట్ల రెగ్యులరైజేషన్ ఒక్కటే పెద్ద సమస్య త్వరలోనే ఆ సమస్య తీరనుంది అని అన్నారు. ఈ కార్నర్ మీటింగ్ కి కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Next Story

Most Viewed