కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించండి

by Disha Web Desk 11 |
కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించండి
X

దిశ, రాజేంద్రనగర్ :: రాజేంద్రనగర్ నియోజకవర్గం మైనార్టీ మహిళల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం 2000 మంది మహిళలతో శనివారం సాయంత్రం మైలార్దేవ్ పల్లి డివిజన్ లోని దుర్గా ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, సీనియర్ నాయకులు పుట్టం పురుషోత్తం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బిజెపి పార్టీలు మోసపూరిత హామీలు ఇస్తూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నాయని మండిపడ్డారు. బి ఆర్ ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed